వాషింగ్టన్: అమెరికా విదేశాంగ శాఖ(US State Department) అధికారిక ప్రతినిధిగా వేదాంత పటేల్(Vedant Patel) బాధ్యతలు నిర్వర్తించనున్నారు. యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్లో తాత్కాలికంగా ప్రతినిధిగా(Interim spokesperson) ఆయన కొనసాగనున్నారు. ఆ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైజ్ఈ నెలలో రిటైర్ కానున్న నేపథ్యంలో.. భారతీయ సంతతికి చెందిన వేదాంత పటేల్కు ఆ అవకాశం దక్కింది. తాత్కాలిక ప్రతినిధిగా వేదాంత పటేల్ పనిచేస్తారని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ ఒక ప్రకటనలో తెలిపారు.
విదేశాంగ శాఖలో ఆంటోనీ బ్లింకెన్(Anthony Blinken) వద్ద నెడ్ ప్రైస్ నేరుగా పనిచేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. 2021 జనవరి 20వ తేదీ ఆ శాఖలో అధికార ప్రతినిధిగా నెడ్ ప్రైస్(Ned Price) జాయిన్ అయ్యారు. నెడ్ ప్రైస్ తన శాఖ తరపున దాదాపు 200కు పైగా బ్రీఫింగ్స్ను నిర్వహించినట్లు బ్లింకెన్ తన ప్రకటనలో తెలిపారు.
నెడ్ ప్రైస్ స్థానంలో ఇంచార్జిగా వస్తున్న వేదాంత పటేల్ ఆ బాధ్యతల్ని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇండియాలో పుట్టిన పటేల్.. కాలిఫోర్నియాలో పెరిగారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా(University of California)తో పాటు యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా(University of Florida)లో ఆయన గ్రాడ్యుయేట్ అయ్యారు. గతంలో అధ్యక్షుడు బైడెన్కు అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీ, ప్రతినిధిగా పటేల్ చేశారు. మీడియా రిలేషన్స్, కమ్యూనికేషన్ స్ట్రాటజీలో పటేల్ తన స్కిల్స్ను పెంచుకున్నారు.