ఆత్మకూరు, జూలై 8: వ్యవసాయాన్ని పండుగలా మార్చి న ఘనత సీఎం కేసీఆర్దేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో రూ. 22లక్షలతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి స్థానిక సర్పంచ్ పర్వతగిరి రాజు అధ్యక్షత వహించగా, ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదన్నారు. గ్రామంలో సీసీ రోడ్డు కోసం నిధులు కేటాయిస్తానన్నారు. రైతు వేదిక కోసం నిరంతరం శ్రమించిన రైతు వేదిక సభ్యులను ధర్మారెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సత్కరించారు. సమావేశంలో రైతు వేదిక జిల్లా కోఆర్డినేటర్ బొల్లు భిక్షపతి, ఎంపీపీ మార్క సుమలత, జడ్పీటీసీ కక్కెర్ల రాధిక, గూడెప్పా డ్ మార్కెట్ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి, వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు ఏరుకొండ రవీందర్గౌడ్, కంది శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ రాజస్వామి, ఎంపీటీసీలు బయ్య రమ, సర్పంచ్లు రంపీస మనోహర్, మచ్చిక యాదగిరి, మాడిశెట్టి వేణుగోపాల్, బోళ్ల నరేశ్, కోఆర్డినేటర్లు రవీందర్, సాగర్, విశ్వేశ్వర్రెడ్డి, ఉపసర్పంచ్ వంగాల స్వాతి, ఎంపీడీవో నర్మద, ఎంపీవో ప్రభాకర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శి రవియాదవ్, బొల్లోజు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ప్రారంభం
పరకాల: పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెడ్క్రాస్, అ మెరికా తెలుగు సంఘం సమకూర్చి న ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఎమ్మె ల్యే ధర్మారెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా పరకాల, నడికూడ మండలాలకు చెందిన 11మందికి రూ. 3.84 లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్ రావు, కోశాధికారి డాక్టర్ రాజేశ్వరప్రసాద్, కార్యవర్గసభ్యుడు బండి సారంగపాణి, మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనిత, పరకాల, నడికూడ జడ్పీటీసీలు సిలివేరు మొగిలి, కోడెపాక సుమలత, రైతుబంధు మండల కోఆర్డినేటర్ ఏరుకొండ శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ నల్లెల్ల లింగమూర్తి, టీఆర్ఎస్ మండ ల అధ్యక్షుడు ఆముదాలపల్లి అశోక్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ
గీసుగొండ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కీర్తినగర్ కాలనీకి చెందిన టీఆర్ఎస్ నాయకుడు ఎనబాక ఉపేందర్ మృతదేహంపై ఎమ్మెల్యే పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రమా దంలో గాయపడి చికిత్స పొందుతున్న కన్నయ్య, రామన్నను పరామర్శించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సుంకరి మనీ షా, నాయకులు శివకుమార్, రాజయ్య, రమేశ్ పాల్గొన్నారు.