కీవ్ : కాబూల్లో ఉక్రెయిన్కు చెందిన విమానం (Ukrainian plane) హైజాక్కు గురైంది. గుర్తుతెలియని దుండగులు ఈ విమానాన్ని హైజాక్ చేసినట్లు సమాచారం. తమ దేశానికి చెందిన విమానం హైజాక్ అయినట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. హైజాక్ చేసిన విమానాన్ని దుండగులు ఇరాన్కు తరలించినట్లుగా తమ వద్ద సమాచారం ఉన్నదని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి యెవ్జెనీ యెనిన్ మీడియాకు తెలిపారు. ఉక్రేనియన్ విమానాన్ని గుర్తుతెలియని వ్యక్తులు హైజాక్ చేసి ఇరాన్ తీసుకెళ్లినట్లు రష్యన్ న్యూస్ ఏజెన్సీ టాస్ నివేదించింది.
ఆఫ్ఘనిస్తాన్లోని ఉక్రేనియన్లను తరలించేందుకు వచ్చిన ఉక్రేనియన్ విమానం హైజాక్కు గురైంది. కొద్ది మంది సాయుధులు విమానాన్ని హైజాక్ చేసి ఇరాన్కు తీసుకెళ్లినట్లు తెలుస్తున్నదని ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి యెవ్జెనీ యెనిన్ మంగళవారం చెప్పారు.
‘ఆదివారం మా విమానం కాబూల్లో హైజాక్కు గురైంది. మా నుంచి గుర్తుతెలియని దుండగులు విమానాన్ని దొంగిలించారు. ఉక్రేనియన్లను ఎయిర్లిఫ్టింగ్ చేయడానికి పంపిన ఈ విమానాన్ని.. తమ వారితో నింపుకుని ఇరాన్కు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఉక్రేనియన్లను తరలించేందుకు మరో విమానాన్ని పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’ అని యెవ్జెనీ యెనిన్ తెలిపారు.
ఇలాఉండగా, ఆదివారం 31 మంది ఉక్రేనియన్లతో పాటు 83 మందితో కూడిన సైనిక రవాణా విమానం ఆఫ్ఘనిస్తాన్ నుంచి కీవ్కు చేరుకున్నది. 12 మంది ఉక్రేనియన్ మిలిటరీ సిబ్బంది స్వదేశానికి తిరిగి వచ్చారని, సహాయం కోరివచ్చిన విదేశీ జర్నలిస్టులు, వ్యక్తులను కూడా తరలించినట్లు ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. దాదాపు 100 మంది ఉక్రేనియన్లు ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్లోనే ఉండిపోయారు.
ఆఫీస్ బోర్డు తొలగించిన హురియత్ నేతలు.. ఎందుకంటే..?
‘పీఓకే’లో టెర్రరిస్టుల ర్యాలీ.. మరోసారి బయటపడిన పాకిస్తాన్ తీరు
ఇండియాకు వచ్చిన ఈస్ట్ ఇండియా షిప్
అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా వ్యాపారం చేయండి.. ఎలాగంటే..?
శరీరం బరువు తగ్గించుకోవాలా..? ఇలా ట్రై చేయండి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..