రష్యాతో జరుగుతున్న పోరాటంలో గాయపడిన సైనికులను ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ పరామర్శించారు. ఆస్పత్రిలో ఉన్న సైనికులతో కాసేపు మాట్లాడి, వారికి మెడల్స్, టైటిల్స్ అందించారు. సైనికులు కోరితే సెల్ఫీలు కూడా దిగారు. దీనికి సంబంధించిన ఫొటోలన ఉక్రెయిన్ రక్షణశాఖ ట్విట్టర్లో షేర్ చేసింది.
కీవ్లో రష్యా దళాలతో పోరాటంలో మరణించిన 106 మంది సైనికులను గౌరవించేందుకు జెలెన్స్కీ వెళ్లారు. వీళ్లందర్నీ ‘ఉక్రెయిన్ హీరోలు’గా ఉక్రెయిన్ ప్రభుత్వం పేర్కొంది. వీరిలో 17 మంది సైనికులు మరణించారని, వారికి కూడా జెలెన్స్కీ మెడల్స్ జారీచేశారని తెలిపింది. పోరాటంలో తీవ్రంగా గాయపడిన ఒక సైనికుడిని డాక్టర్ల అనుమతితో జెలెన్స్కీ కలిశారు. ‘‘త్వరగా కోలుకోండి. మనందరి గెలుపే మీకు మంచి బహుమతి అనుకుంటున్నా’’ అని జెలెన్స్కీ అన్నారని ఉక్రెయిన్ రక్షణశాఖ పేర్కొంది.
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో సైనికులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రిని కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు మెచ్చుకున్నారు. కాగా, ఈ యుద్ధంలో 13 వందల మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయారని జెలెన్స్కీ కొన్నిరోజుల క్రితం తెలిపారు. అయితే రష్యా సైనికుల్లో మాత్రం వేలమందిని హతమార్చినట్లు ఆయన పేర్కొన్నాడు.
Президент України Володимир Зеленський відвідав у госпіталі поранених захисників України 🇺🇦
🔊 «Хлопці, швидше одужуйте. Вірю: найкращим подарунком до вашої виписки буде наша спільна перемога!» – зазначив @ZelenskyyUa pic.twitter.com/lHYZJHWvp8
— Defence of Ukraine (@DefenceU) March 13, 2022