ఉక్రెయిన్పై రష్యా యుద్ధం వల్ల ఇప్పటి వరకు 15 లక్షల మంది చిన్నారులు స్వదేశం నుంచి పారిపోయారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధం ప్రకటించారు. దీన్ని ఆ దేశ ప్రభుత్వం సైనిక చర్యగా అభివర్ణిస్తున్నా కూడా.. పశ్చిమ దేశాలు దీన్ని దురాక్రమణగానే భావిస్తున్నాయి.
ఈ క్రమంలో ఉక్రెయిన్ నుంచి పారిపోతున్న వారి తాజా గణాంకాలు షాకింగ్గా ఉన్నాయని పేర్కొన్న యూఎన్ చిల్డ్రన్స్ ఏజెన్సీ అయిన యూనిసెఫ్ వెల్లడించింది.. ‘‘యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి సేకరించిన గణాంకాల ప్రకారం ప్రతి నిమిషం సుమారు 55 మంది చిన్నారులు ఉక్రెయిన్ విడిచి పారిపోయారు. అంటే దాదాపు ప్రతి సెకనుకు ఒక ఉక్రెయిన్ చిన్నారి శరణార్థిగా మారుతున్నాడు’’ అని యూనిసెఫ్ ప్రతినిధి జేమ్స్ ఎల్డర్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఉక్రెయిన్ చిన్నారులకు శాంతి కావాలంటూ ఐక్యరాజ్య సమితి కూడా ట్వీట్ చేసింది. ఇప్పటికీ ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నా.. ఫలితం మాత్రం శూన్యంగా కనిపిస్తోంది.
A Ukrainian child has become a refugee almost every single second since the start of the war.
They need peace now.https://t.co/VB1z5b1wzl via @UNICEF pic.twitter.com/qb7AQQ0F6h
— United Nations (@UN) March 15, 2022