ఉక్రెయిన్లో కీలకమైన అణువిద్యుత్ కేంద్రం చెర్నోబిల్పై రష్యా ప్రభుత్వం ఉగ్రదాడి చేయాలని పథకాలు రచిస్తున్నట్లు ఉక్రెయిన్ ప్రబుత్వం ఆరోపించింది. చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రంలో అత్యంత ప్రమాదకరమైన ఘటనను సృష్టించడానికి రష్యా బలగాలు ప్రయత్నిస్తున్నాయి.
ఆ తర్వాత దీనికి కారణం ఉక్రెయిన్ ప్రభుత్వమే అని రష్యా ప్రచారం చేస్తుంది అంటూ ఉక్రెయిన్ డిఫెన్స్ ఇంటెలిజన్స్ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ మేరకు ఒక ట్వీట్ చూడా చేసిందీ విభాగం. గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్, రష్యా మధ్య పోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఉక్రెయిన్ దళాలతో పోరాడేందుకు వాలంటీర్లను ఆహ్వానిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించాడు. దీంతో తమతో పోరాడేందుకు 16 వేల మంది ఐఎస్ఐఎస్ ఫైటర్లను రష్యా రిక్రూట్ చేసుకుందని ఉక్రెయిన్ ఆరోపించింది. వీటిపై రష్యా ఎటువంటి ప్రకటనా చేయలేదు.
కాగా, ఉక్రెయిన్లో అమెరికా జీవాయుధాలను అభివృద్ధి చేస్తోందని రష్యా కూడా ఆరోపించింది. ఈ విషయంలో ప్రపంచానికి అమెరికా సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. అయితే రష్యా చెప్పేవన్నీ అబద్ధాలేనని, తర్వాత ఉక్రెయిన్లో జీవాయుధాలను ఉపయోగించేందుకు ఇదొక సాకులా వాడుకుంటుందని అమెరికా కొట్టిపారేసింది.
#DIUinforms
‼ Putin is preparing a terrorist attack on the Chernobyl nuclear power plant ☢️
A man-made catastrophe is planed at the CNPP controlled by Russian forces, for which the occupiers will try to shift responsibility to Ukraine.
More details👉 https://t.co/XclhW1VA0H pic.twitter.com/5f1WdNuoOp— Defence intelligence of Ukraine (@DI_Ukraine) March 11, 2022