లండన్ : విదేశీ విద్యార్ధులు లక్ష్యంగా బ్రిటన్ (UK) ప్రభుత్వం నూతన ఇమిగ్రేషన్ నిబంధనలను ప్రవేశపెట్టింది. భారతీయులు సహా విదేశీ విద్యార్ధుల్లో కేవలం పోస్ట్గ్రాడ్యుయేట్ విద్యార్ధులు మాత్రమే వారు బ్రిటన్ విద్యాసంస్ధల్లో ప్రవేశం తీసుకునే క్రమంలో కుటుంబ సభ్యులు, డిపెండెంట్లను తీసుకువచ్చేందుకు అనుమతిస్తారు.
రీసెర్చి ప్రోగ్రామ్లుగా పిలిచే పీజీ కోర్సుల్లోని అంతర్జాతీయ విద్యార్ధులనే వారి పిల్లలు, తల్లితండ్రులు సహా కుటుంబ సభ్యులను డిపెండెంట్లుగా దేశంలోని అనుమతిస్తామని బ్రిటన్ హోం కార్యదర్శి సులా బ్రవర్మన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ రూట్ నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేపట్టలేదని, అత్యంత నైపుణ్యాలను కలిగిన వారికి బ్రిటన్కు రప్పించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
Read More