న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్ ఆక్రమించుకోవడం సబబే అని, వారి పోరాటం న్యాయసమ్మతమైనదే అని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఏఐఎంపీఎల్బీ) పేర్కొన్నది. భారత్లోని ముస్లింల తరఫున వారికి సెల్యూట్ చేస్తున్నాను అని బోర్డ్ అధికార ప్రతినిధి సజ్జాద్ నోమాని (Sajjad Nomani) తెలిపారు. ప్రపంచలోని అత్యంత బలమైన శక్తులను తాలిబాన్ మట్టికరిపించిందని కొనియాడారు. ఆఫ్ఘనిస్తాన్ను తమ వశం చేసుకోవడంలో ఎలాంటి తప్పులేదని సజ్జాద్ నోమాని తెలిపారు. వారు చేసింది ముమ్మాటికీ కరెక్టే అని, నిరాయుధ దేశం శక్తివంతమైన శక్తులను ఓడించడం మామూలు విషయం కాదన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలు ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ తరఫున సజ్జాద్ నోమానీ చేశారా? లేదా ఆయన వ్యక్తిగతమా? అనేది తెలియరాలేదు.
ఇప్పటికే సమాజ్వాదీ పార్టీకి చెందిన సంబల్ ఎంపీ షఫీఖర్ రెహ్మాన్ బుర్కే కూడా తాలిబాన్కు మద్దతుగా ప్రకటన చేశారు. తమ దేశ స్వాతంత్య్రం కోసం తాలిబాన్ నాయకత్వంలో ప్రజలు పోరాడుతున్నారని, వారి నాయకత్వంలో అక్కడి ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారని బుర్కే అన్నారు. బ్రిటీష్ వలస పాలన నుంచి బయటపడేందుకు భారతీయులు చేసిన మాదిరిగానే, ఆఫ్ఘాన్ ప్రజలు తాలిబాన్ నేతృత్వంలో తమ దేశానికి విముక్తి కల్పించుకున్నారని బుర్కా అన్నారు.
ప్రాణాలకు తెగించి హక్కుల కోసం గళమెత్తారు..
నేతాజీ… గగన సిగలకెగసి కనుమరుగై పోయాడు..
ట్విట్టర్ బర్డ్ ఫ్రై.. ఎందుకు చేశారంటే..?
వారు అధికారంలోకొచ్చారు.. మహిళా మోడల్స్పై సున్నమేశారు..!