మన పొరుగు దేశం శ్రీలంక.. చరిత్రలో ఎరుగనటువంటి ఆర్థిక మాంద్యంలో అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే అక్కడి అధ్యక్షుడు కూడా రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తోంది కొత్త ప్రభుత్వం. ఇలాంటి సమయంలో రానున్న కొద్దిరోజుల్లో దేశంలో విపరీతమైన ఆహార కొరత ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే రైతులంతా ముందుకొచ్చి ఎక్కువగా ఆహార పదార్థాల పంటలు వేయాలని, వరి పండించాలని శ్రీలంక ప్రభుత్వం కోరింది. ‘‘ఆహార పరిస్థితులు దారుణంగా తయారవుతున్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే రైతులంతా మళ్లీ పొలాల వైపు అడుగులు వేయాలని, ఎక్కువగా పండించాలని కోరుతున్నాం’’ అని వ్యవసాయ శాఖ మంత్రి మహింద అమరవీర తెలిపారు.