న్యూఢిల్లీ : ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఈ-20పెట్రోల్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా వాహనదారుల్లో ఈ-20 పెట్రోల్ మీద ఆందోళన పెరుగుతున్నదని తెలిపారు. ప్రస్తుతం ప్రజలు పెట్రోల్, డీజిల్ వాహనాలను కొనడం మానేసి సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు.
దీంతో డీలర్ల వద్ద పెట్రోల్, డీజిల్ వాహనాలు పేరుకుపోతున్నాయని.. ఎక్స్లో ఓ నెటిజన్ చేసిన పోస్టుపై కేజ్రీవాల్ స్పందించారు. దేశ ప్రజల్లో ఈ-20 పెట్రోల్పై వ్యతిరేకత పెరుగుతున్నదని.. ఇది ఆర్థిక వ్యవస్థకు నష్టం తెచ్చేలా ఉందన్నారు. ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కావాలని ఆప్ ఎన్నోసార్లు కోరినా.. సరైన సమాధానం రావట్లేదన్నారు. కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు.