సియోల్: సాధారణంగా మనం పబ్లిక్ ప్రదేశాల్లో టాయిలెట్లను వినియోగిస్తే మన నుంచి కొంత రుసుము వసూలు చేస్తారు. కానీ దక్షిణకొరియాలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. అక్కడ కొన్ని టాయిలెట్స్ను వినియోగిస్తే మన నుంచి డబ్బులు వసూలు చేయడానికి బదులుగా తిరిగి మనకే డబ్బులిస్తారట. ఆశ్చర్యంగా ఉంది కదూ..! కానీ ఇది నిజం. మరి ఎందుకలా డబ్బులిస్తున్నారూ.. అంటే దాని వెనుక పెద్ద కారణమే ఉన్నది. ఆ కారణం ఏంటో మీక్కూడా తెలుసుకోవాలని ఉందా..
దక్షిణకొరియాలోని ఉల్సాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పట్టణ, పర్యావరణ ఇంజినీరింగ్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తించే చో జై-వూన్ ఓ కొత్త రకం మరుగుదొడ్డిని రూపొందించారు. ఆ మరుగుదొడ్లలో మానవ వ్యర్థాలను ఉపయోగించి బయోగ్యాస్, ఎరువులను ఉత్పత్తి చేస్తున్నారు. వాక్యూమ్ పంప్ సాయంతో మానవ వ్యర్థాలను భూగర్భ ట్యాంకులోకి పంపి.. సూక్ష్మజీవుల ద్వారా మిథేన్గా మారుస్తున్నారు.
అనంతరం దాని నుంచి ఇంటికి అవసరమైన విద్యుత్తు, బయోగ్యాస్, ఎరువులను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఉల్సాన్ యూనివర్సిటీకి సరిపడా విద్యుత్తును ఈ కొత్త రకం మరుగుదొడ్ల నుంచే వాడుతున్నారు. విద్యుత్తు, ఎరువుల తయారీకి మలం ఎంతగానో ఉపయోగపడుతుందని చో చెబుతున్నారు. అందుకే ఈ మరుగుదొడ్లను స్థానిక ప్రజలు వాడేలా ప్రోత్సహించేందుకు తిరిగి కొంత నగదు చెల్లిస్తున్నామని తెలిపారు.
ఈ మరుగుదొడ్లను వినియోగించడం ద్వారా వచ్చే డిజిటల్ కరెన్సీతో కాఫీ టీలు, అరటి పండ్లు లాంటివి కొనుగోలు చేయవచ్చునని చో జై-వూన్ చెప్పారు. అంతేగాక ఆ మరుగుదొడ్డిలోని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే డబ్బులు నేరుగా ఖాతాలో జమ అవుతాయని ఆయన వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
లేహ్ ఆందాల వీక్షణకు పోటెత్తిన టూరిస్టులు..!
ఇంట్లో దూరి 21 పిల్లలు చేసిన నాగుపాము..!
ముక్కులో చెక్కపుల్లలు.. వారమైనా గుర్తించలేకపోయిన మహిళ..!
అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టిన వృద్ధుడు.. వైరల్ వీడియో