రష్యా సేనలు చేస్తున్న భయంకరమైన దాడి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయి వచ్చిన ఉక్రేనియన్లకు పోలాండ్ ప్రభుత్వం ఉపశమనం కల్పిస్తోంది. తాజాగా ఇక్కడకు చేరిన ఉక్రెయిన్ వలసలకు పెసెల్ గుర్తింపు కార్డులను పంచుతోంది. వీటితో ఈ ఉక్రేనియన్లంతా.. పోలాండ్లో ఉద్యోగాలు చేసుకోవచ్చు, వారి పిల్లలకు చదువుకోవచ్చు.
అంతేకాదు, వీటి ద్వారా ఈ వలసదారులకు 18 నెలలపాటు ఆరోగ్య, సామాజిక పథకాల ఫలాలు కూడా అందుతాయి. వీటిని తమకు అందిస్తున్నందుకు ఉక్రేనియన్ ప్రజలు పోలాండ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తమకు ఇది కొత్త ప్రదేశమని, కొత్త జీవితానికి అలవాటు పడేందుకు ప్రయత్నిస్తున్నామని వాళ్లు చెప్తున్నారు. ఈ కార్డు దారులందరికీ తొలి నెలలో పోలాండ్ ప్రభుత్వం నుంచి 70 డాలర్ల ఆర్ధిక సాయం అందుతుంది.
అలాగే 18 ఏళ్లలోపు వారందరికీ నెలకు 117 డాలర్ల సాయం అందిస్తారు. ఇక్కడ ఉద్యోగాలు సంపాదించుకున్న వారు కూడా పోలాండ్ ప్రజల్లాగే పన్నులు కట్టాల్సి ఉంటుంది. కాగా, ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా ప్రభుత్వం యుద్ధం ప్రకటించినప్పటి నుంచి 30 లక్షలమందికిపైగా ప్రజలు ఉక్రెయిన్ విడిచి పారిపోయినట్లు యూఎన్ అంచనా. వీరిలో 20 లక్షల మంది వరకు పోలాండ్ చేరారని సమాచారం.