ఇస్లామాబాద్, మార్చి 19: పాకిస్థాన్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్తోపాటు డజను మందికిపైగా పీటీఐ (పాకిస్థాన్ తెహ్రిక్-ఎ-ఇన్సాఫ్) పార్టీ నాయకులపై పోలీసులు ఉగ్రవాద కేసు నమోదు చేశారు. ఇస్లామాబాద్ కోర్టులో శనివారం ఇమ్రాన్ ఖాన్ అవినీతి కేసు విచారణకు ముందు పీటీఐ కార్యకర్తలు విధ్వంసానికి తెగబడటం, భద్రతా సిబ్బందిపై దాడికి దిగడం, జ్యుడిషియల్ కాంప్లెక్స్ వెలుపల అశాంతిని సృష్టించడంతో ఆదివారం ఈ కేసు నమోదైంది.
ఇమ్రాన్ ఖాన్ లాహోర్ నుంచి ఇస్లామాబాద్కు రాగానే అక్కడి జ్యుడిషియల్ కాంప్లెక్స్ వెలుపల పీటీఐ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. దీంతో 25 మంది భద్రతా సిబ్బం దికి గాయాలయ్యాయి. కేసు విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు.