ఇస్లామాబాద్: చరిత్రలో ఎన్నడూ లేనంతంగా వరదలతో అల్లాడిన పాక్.. ఇప్పుడు భారత్ సాయం కోరుతున్నది. వరద ప్రభావిత ప్రాంతాల్లో దోమల వల్ల వ్యాధులు సోకకుండా ఉండేందుకు ప్రజలకు దోమ తెరలు అందించనుంది. దీనికోసం ఇండియా నుంచి పెద్దసంఖ్యలో దోమ తెరలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. 6.2 మిలియన్ల దోమతెరలు కొనాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదించింది.
గత నెలలో పాకిస్థాన్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో దేశంలో చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఇప్పటికీ ఆయా ప్రాంతాలు నీటమునిగే ఉన్నాయి. ఈ క్రమంలో 32 వరద ప్రభావిత జిల్లాల్లో మలేరియా వేగంగా విస్తరిస్తున్నది. వేలాది మంది పిల్లలను దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో దోమల వల్ల కలిగే వ్యాధుల నుంచి తమ పౌరులను రక్షించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అధికారులు వెల్లడించారు. కాగా, దేశంలో కుంభవృష్టి వర్షాలతో 3 కోట్ల 30 మంది జనాభా ప్రభావితమయ్యారు. భారీ వరదలు సంభవించడంతో 1600 మంది మరణించారు. వేల సంఖ్యలో ఇండ్లు నేలమటమయ్యాయి.