ఇస్లామాబాద్, ఏప్రిల్ 12: పశ్చిమాసియా యుద్ధం వేళ గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో సౌదీ అరేబియాకు పాకిస్థాన్ నుంచి భారీ సైనిక, రక్షణ మద్దతు లభించింది. భారీ ఎత్తున సైనిక బలగాలను, యుద్ధ విమానాలను సౌదీ అరేబియాకు పంపినట్టు పలు నివేదికలు పేర్కొన్నాయి. పాక్కు చెందిన 13,000 మంది సైనికులను, 10 నుంచి 18 యుద్ధ విమానాలను సౌదీ అరేబియాలో మోహరించినట్టు తెలిసింది.
వీటిని సౌదీ అరేబియా తూర్పు సెక్టార్లోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఎయిర్బేస్ వద్ద మోహరించినట్టు సమాచారం. ఇరు దేశాల మధ్య గత ఏడాది కుదిరిన వ్యూహాత్మక రక్షణ ఒప్పందంలో భాగంగా ఈ సైనిక మోహరింపు చేపట్టినట్టు పాకిస్థాన్ ప్రభుత్వ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం, ఒక దేశంపై జరిగే ఎలాంటి దాడినైనా మరో దేశంపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు.