Pak army chief | ప్రతీకార సుంకాల నేపథ్యంలో భారత్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాషింగ్టన్తో పాకిస్థాన్ సంబంధాలు బలపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్థాన్ ఆర్మీ ఫీల్డ్ మార్షల్ (Pak army chief) సయ్యద్ అసిం మునీర్ మరోసారి అమెరికా పర్యటనకు వెళ్లబోతున్నారు. ఈ విషయాన్ని పాక్ మీడియా వెల్లడించింది. ఈ నెలలో సెంట్రల్ కమాండ్ (CENTCOM) జనరల్ కురిల్లా పదవీ విరమణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మునీర్ వాషింగ్టన్ వెళ్తున్నట్లు సమాచారం.
కాగా, అసిం మునీర్ (Asim Munir) యూఎస్ సందర్శనకు వెళ్లడం రెండు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈఏడాది జూన్లో అసిం మునీర్ అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ట్రంప్తో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ట్రంప్ వైట్ హౌస్లో మునీర్కు ప్రత్యేకంగా విందు కూడా ఇచ్చారు.
భారత్పై అధిక సుంకాలు, పెనాల్టీలు విధించిన ట్రంప్.. పాకిస్థాన్తో (Pakistan) జట్టుకట్టారు. ఆ దేశంతో వాణిజ్య ఒప్పందం (Trade Deal) చేసుకున్నట్లు వెల్లడించారు. పాక్తో భారీ చమురు నిల్వల అభివృద్ధికి ఒప్పందం కుదిరినట్లు ప్రకటించారు. భారత్కు పాకిస్థాన్ ఏదో ఒక రోజు చమురు విక్రయించవచ్చని వెల్లడించారు. భాగస్వామ్యానికి నాయకత్వం వహించే చమురు కంపెనీని ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతున్నదని తన సామాజిక మాధ్యమం ట్రూత్ వేదికగా తెలిపారు.
Also Read..
TCS | ఉద్యోగులకు టీసీఎస్ తీపి కబురు.. 80 శాతం ఉద్యోగుల వేతనాలు పెంపు