ఉక్రెయిన్పై రష్యా దళాలు దాడి చేయడాన్ని నాటో చీఫ్ జెన్స్ స్టాల్టెన్బర్గ్ ఖండించారు. సోమవారం నాడు ఈ దాడులపై స్పందించిన ఆయన.. ఉక్రెయిన్లోని సివిలియన్ లక్ష్యాలపై రష్యా చేసిన దారుణమైన దాడులను ఖండిస్తున్నట్లు చెప్పారు. ‘ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబాతో మాట్లాడాను. ఆ దేశంలోని సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లపై రష్యా దాడులను ఖండించాను’ అని స్టోల్టెన్బర్గ్ చెప్పారు.
రష్యా దాడులను ఎదుర్కొని పోరాడటంలో ఉక్రెయిన్ ప్రజలకు తమ సహకారం కొనసాగుతుందని ఆయన తెలిపారు. కాగా, రష్యా నుంచి క్రిమియా వెళ్లే బ్రిడ్జిపై ఉక్రెయిన్ దళాలు దాడి చేశాయి. దీనికి ప్రతిగా ఉక్రెయిన్లోని ఎనర్జీ, మిలటరీ టార్గెట్లపై రష్యా దాడులు చేసింది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ చేసే దాడులను చాలా సీరియస్గా తీసుకుంటామని, బలంగా ప్రతిఘటిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే.
Spoke with Foreign Minister @DmytroKuleba & condemned #Russia's horrific & indiscriminate attacks on civilian infrastructure in #Ukraine. #NATO will continue supporting the brave Ukrainian people to fight back against the Kremlin's aggression for as long as it takes.
— Jens Stoltenberg (@jensstoltenberg) October 10, 2022