టెక్సాస్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కొత్త ప్రాజెక్టు వివరాలను వెల్లడించింది. చంద్రుడిపై ప్రయోగించనున్న ఆర్టెమిస్ రాకెట్కు చెందిన అప్డేట్ ఇచ్చింది. స్పేస్ లాంచ్ సిస్టమ్కు చెందిన రాకెట్ను .. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్లో లాంచ్ప్యాడ్కు తీసుకువచ్చారు. ఆ రాకెట్ ద్వారా తొలుత వ్యోమగాములులేని క్యాప్సూల్ను చంద్రుడి మీదకు పంపనున్నారు. ఒకవేళ అన్నీ అనుకూలిస్తే మరికొన్ని నెలల్లో ఆర్టెమిస్ రాకెట్ నింగికి ఎగరనున్నది. ఎస్ఎల్ఎస్ రాకెట్లను నాసా కొత్తగా డెవలప్ చేస్తోంది. అయితే ఈ రాకెట్ల ద్వారా మూన్ మీదకు మనుషుల్ని పంపాలనుకుంటోంది. ఈ దశాబ్ధం రెండవ అర్థభాగంలో ఎస్ఎల్ఎస్ రాకెట్ ద్వారా వ్యోమగాములను చంద్రుడి మీదకు పంపాలని నాసా భావిస్తోంది.
The rollout of the @NASAArtemis I rocket is happening. Long-term lunar exploration is within reach. You coming?
Join our journey to the Moon: Submit your name to be flown aboard the @NASA_Orion spacecraft. https://t.co/9tS402d9VO pic.twitter.com/NJCIg4jGO7
— NASA (@NASA) March 18, 2022
ఎస్ఎల్ఎస్ రాకెట్.. సైజ్లో చాలా పెద్దది. దాదాపు 100 మీటర్ల ఎత్తు ఉన్నది. 1960, 70 దశకాల్లో ప్రయోగించిన అపోలో అంతరిక్ష నౌకల కన్నా భారీగా ఉంటుందని చెబుతున్నారు. వ్యోమగాముల్ని భూ కక్ష్యను దాటివ్వడమే కాకుండా భారీ స్థాయిలో కార్గోను కూడా తీసుకువెళ్లే సామర్థ్యంతో ఈ రాకెట్ను రూపొందిస్తున్నారు. ఏప్రిల్ 3వ తేదీన ఎస్ఎల్ఎస్ రాకెట్కు రిహార్సిల్ చేయనున్నారు.