Palestine | పాలస్తీనా అధ్యక్షుడు (Palestinian President) మహమూద్ అబ్బాస్ (Mahmoud Abbas) కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వద్ద సుదీర్ఘ కాలంగా సలహాదారుగా పనిచేస్తున్న మొహమ్మద్ ముస్తఫా (Mohammad Mustafa)ను పాలస్తీనా అథారిటీకి కొత్త ప్రధానిగా నియమించారు.
ఇజ్రాయెల్పై దాడి అనంతరం పాలస్తీనాకు ప్రధానిగా ఉన్న మొహమ్మద్ శతాయే ఫిబ్రవరిలో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రధాని పేషీకి సంబంధించిన నిర్ణయాలు అధ్యక్షుడే తీసుకుంటూ వచ్చారు. అయితే, పూర్తి స్థాయిలో ఓ ప్రధానిని నియమించాలని భావించిన అధ్యక్షుడు మహమూద్.. తన వద్ద సలహాదారుగా పనిచేస్తున్న ముస్తఫాకు ప్రధాని బాధ్యతలు అప్పగించారు. పాలస్తీనా అథారిటీ (Palestinian Authority)లో సంస్కరణలు చేపట్టాలని ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో ఈ నియామకాన్ని చేపట్టారు.
అయితే, కొత్త ప్రధాని అధికారాలు ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్బ్యాంక్లో చాలా పరిమితంగానే ఉండనున్నాయి. ధ్వంసమైన గాజా స్ట్రిప్ పునర్నిర్మాణం, పలు వ్యవస్థల సంస్కరణల బాధ్యతలను ప్రధానికి అప్పగించనున్నట్లు తెలిసింది. 2007 నుంచి గాజా స్ట్రిప్ హమాస్ నియంత్రణలోకి వెళ్లగా.. వెస్ట్ బ్యాంక్లో పాలస్తీనా అథారిటీ అధికారంలో ఉంది.
Also Read..
Fire Incidents | రెండున్నర నెలల్లో 2,682 అగ్నిప్రమాదాలు.. 39 మంది మృతి : ఢిల్లీ అగ్నిమాపక శాఖ
Mamata Banerjee | నుదుటిపై మూడు కుట్లు.. నిలకడగానే దీదీ ఆరోగ్యం : అధికారులు
Traffic Alert | ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు.. సాయంత్రం 4 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు