Traffic Alert | సిటీబ్యూరో, మార్చి 14 (నమస్తే తెలంగాణ): నేడు ఎల్బీస్టేడియంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగనున్న ఇఫ్తార్ విందు సందర్భంగా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందన్నారు.అలాగే నేడు, రేపు నగరంలో ప్రధాన మంత్రి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.