హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డికి చెందిన ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తున్నది. ఫార్మాకంపెనీలో ల్యాబ్ టెక్నీషియన్లుగా చేయాలనుకునేవారు ఈనెల 20లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆర్ఆర్ ఫౌండేషన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లోని యువతకు ప్రాధాన్యమివ్వనున్నట్టు పేర్కొన్నది. ఆసక్తిగలవారు 9491547148 నంబర్కు వాట్సప్ చేయాలని తెలిపింది.