న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీపై (PM Modi) అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మాల్దీవుల యువత సాధికారత డిప్యూటీ మంత్రి మరియం షియునా,మంత్రులు మల్షా షరీఫ్, మహ్జుం మజీద్ ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ ఉదంతాన్ని మాల్దీవుల ప్రభుత్వ దృష్టికి భారత్ తీసుకువచ్చింది. ప్రధాని మోదీని ఉద్దేశించి మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలను మాల్దీవుల ప్రభుత్వం ఖండించింది. వారి వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేసింది.
కాగా, మరియం షియునా ప్రధాని లక్షద్వీప్ సందర్శించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మోదీపై వ్యంగ్యోక్తులకు తెగబడింది. మోదీని విదూషకుడని, తోలుబొమ్మ అంటూ ఎక్స్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు పెనుదుమారం రేపడంతో ఆపై సదరు పోస్ట్ను డిలీట్ చేసింది.
ప్రధాని లక్షద్వీప్లో టూరిజాన్ని ప్రోత్సహించేందుకు సోషల్ మీడియా వేదికగా పలు ఫొటోలు షేర్ చేసిన అనంతరం మరియం షియునా మోదీ లక్ష్యంగా ఈ వ్యాఖ్యలు చేసి ఆపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయా ట్వీట్లను డిలీట్ చేసింది.
దీంతో మాల్దీవుల్లో భారత హై కమిషనర్ ఈ అంశాన్ని మహ్మద్ మిజు నేతృత్వంలోని మాలే సర్కార్ దృష్టికి తీసుకువెళ్లారు. మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ సైతం ప్రధాని మోదీపై మరియం షియునా అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆమె అసహ్యమైన పదజాలం వాడారని అన్నారు. మాల్దీవులకు కీలక భాగస్వామ్య దేశాధినేత పట్ల మంత్రి మరియం షియునా తీరు మాల్దీవుల భద్రత, సౌభాగ్యానికి గొడ్డలిపెట్టు వంటిదని అన్నారు.. మంత్రి వ్యాఖ్యల పట్ల మహ్మద్ మిజు ప్రభుత్వం దూరం పాటించాలని, ఆమె వ్యాఖ్యలు ప్రభుత్వ విధానాన్ని ప్రతిబింబించేవి కాదని భారత్ సర్కార్కు స్పష్టం చేయాలని ఎక్స్ వేదికగా ఆయన రాసుకొచ్చారు.
Read More :
Animal Movie | మీ ఆర్ట్ పెద్ద అబద్ధం.. జావేద్ అక్తర్పై యానిమల్ టీమ్ విమర్శలు