Luxury Cruise | 200 మందికిపైగా ప్రయాణికులతో వెళ్తున్న ఓ విలాసవంతమైన క్రూయిజ్ షిప్ (Luxury Cruise Ship) సముద్రంలో చిక్కుకుపోయింది. ప్రముఖ వార్తా సంస్థ ఇండిపెండెంట్ నివేదిక ప్రకారం.. మూడు వారాల ట్రిప్ కోసం ఈ నెల 1న బయలుదేరిన నౌక 22న తిరిగి పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. అయితే, గ్రీన్ల్యాండ్ (Greenland) రాజధాని నుక్ (Nuuk)కు 850 మైళ్ల దూరంలో సోమవారం మధ్యాహ్నం ఈ నౌక సముద్రంలో చిక్కుకుపోయినట్లు తెలిపింది. ప్రస్తుతం నౌకలోని ప్రయాణికులు, సిబ్బందితో కలిసి 206 మంది ఉన్నారని.. అందరూ క్షేమంగా ఉన్నట్టు వెల్లడించింది. రెస్క్యూ షిప్ శుక్రవారం వరకు అక్కడకి చేరుకునే పరిస్థితి లేదని పేర్కొంది. మరోవైపు ఈ ట్రిప్ కోసం షిప్ యాజమాన్యం ఒక్కో ప్రయాణికుడి నుంచి దాదాపు రూ. 27 లక్షలు (33 వేల డాలర్లు) వసూలు చేశారు.
ప్రస్తుతం నౌకలోని వారంతా క్షేమంగా ఉన్నట్లు షిప్ ఆపరేటర్ తెలిపారు. షిప్లో ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయని వెల్లడించారు. అయితే ప్రయాణికుల్లో కొందరికి కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. దీంతో కాస్త ఆందోళన వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం పాజిటివ్గా తేలిన వారిని ఓ గదిలో ఉంచి వైద్యం అందిస్తున్నట్లు వివరించారు.
From Artic Commands Facebook page;
“Arctic Command has been in contact with the cruise ship Ocean Explorer, which has stated that they are still grounded in the National Park.This means that the tide, which came during the day local time, did not provide the desired help to… pic.twitter.com/cmxEyWCzBH
— Orla Joelsen (@OJoelsen) September 12, 2023
Satellite view of the Ocean Explorer – the cruise ship aground in the Alpefjord (East Greenland) with 206 people on board – as seen by @CopernicusEU Sentinel-2 yesterday. Not a very friendly place to be stuck at, but the good news is that the fjord is largely free of icebergs. pic.twitter.com/HV7KwiPvzS
— Bert Wouters (@bert_polar) September 12, 2023
Also Read..
Jawan Movie | జవాన్ చిత్రంపై బన్నీ రివ్యూ.. షారుఖ్ మాస్ అవతార్ అంటూ ట్వీట్
Nipah virus | కేరళలో నిఫా బంగ్లాదేశ్ వేరియంట్.. వ్యాప్తి తక్కువే అయినప్పటికీ మరణాల రేటు ఎక్కువ
Libya Floods | లిబియాలో మృత్యుఘోష.. వరదలకు 20 వేల మంది బలి