Hamas-Israel War | ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం గత ఏడునెలలుగా కొనసాగుతున్నది. హమాస్ను తుదముట్టించాలని ఇజ్రాయెల్ సంకల్పించింది. ఇప్పటి వరకు యుద్ధంలో 30వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, అన్ని దేశాలు కాల్పుల విరమణ ప్రకటించే అవకాశం ఉందని భావిస్తూ వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఇజ్రాయెల్ కాల్పుల విరమణ చర్చలకు ఇజ్రాయెల్ స్వస్తి పలికింది. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాన క్రాసింగ్ పాయింట్పై హమాస్ ఆదివారం భారీ దాడిని ప్రారంభించింది. మానవతా సహాయ ట్రక్కుల కోసం కెరెమ్ షాలోమ్ క్రాసింగ్ను మూసివేయాలని ఇజ్రాయెల్ సైన్యం సోమవారం నిర్ణయించింది.
దీంతో గాజా ప్రజల కష్టాలు మరింత పెరగనున్నాయి. అదే సమయంలో హమాస్ సైనిక విభాగం కస్సామ్ బ్రిగేడ్స్, సరిహద్దుకు సమీపంలో ఉన్న ఇజ్రాయెల్ బలగాల గుంపును లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. ఇజ్రాయెల్ సైన్యం కమాండ్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా జరిపిన దాడిలో మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కెరెమ్ షాలోమ్ క్రాసింగ్ వద్ద పది రాకెట్లు ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దాడి జరిగిన వెంటనే క్రాసింగ్ను మూసివేయాలని ఇజ్రాయెల్ సైన్యం నిర్ణయించింది.
తాజాగా హమాస్తో కాల్పుల విరమణ చర్చలకు ఒప్పుకునే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్ మళ్లీ బయటకు వచ్చి గాజాను తన అధీనంలోకి తీసుకుని, బంకర్లు నిర్మించే పరిస్థితిని అంగీకరించలేమన్నారు. తమ పౌరుల భద్రతను ప్రమాదంలో పడవేయలేమని స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా వస్తున్న విమర్శలను సైతం ఆయన తోసిపుచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒంటరిగా పోరాడేందుకు తాము సిద్ధమేనన్నారు. ఎలాగైనా మమ్మల్ని అంతం చేయాలనుకుంటున్న శత్రువుతో తాము పోరాడుతున్నామని.. అంతర్జాతీయ నేతలకు తాను చెప్పేది ఒక్కటేనని.. ఏ ఒత్తిడి, అంతర్జాతీయ నిర్ణయాలు, మమ్మల్ని స్వీయరక్షణ చర్యలు తీసుకోకుండా ఆపలేవన్నారు.