కరాచీ : పవిత్ర జన్మాష్టమి రోజునే పాకిస్తాన్లో హిందువుల పట్ల అక్కడి వారి అమానుషం బయటపడింది. సింధ్లో శ్రీకృష్ణుడి ఆలయంపై (Sri Krishna Temple) వందలాది మంది మూకుమ్మడి దాడి జరిపి విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనను అడ్డుకునేందుకు వెళ్లిన పలువురు హిందువులను కూడా గాయపరిచినట్లు సమాచారం. ఈ ఘటనతో పాకిస్తాన్ మైనార్టీ హిందువుల పట్ల ప్రభుత్వం తీరు స్పష్టమైందని పలువురు హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన ఫొటోలు సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న పలువురు హిందువులు ఘటనా స్థలానికి చేరుకుని తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని తప్పించారు. ఈ ఘటనతో సంబంధమున్న వారిలో ఇంతవరకు ఎవర్నీ అరెస్టు చేయలేదు.
పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్ సంఘర్ జిల్లాలోని ఖిర్పో ప్రాంతంలో శ్రీకృష్ణుడి దేవాలయాన్ని అక్కడి వేర్పాటువాదులు ధ్వంసం చేశారు. ఆలయంలోని విగ్రహాలను కూడా ముక్కలుముక్కలుగా చేశారు. అడ్డుకోబోయిన హిందువులను కొట్టారు. దురుసుగా ప్రవర్తించారు. దాంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
పాకిస్థాన్ మానవ హక్కుల కార్యకర్త రహత్ ఆస్టిన్ సింధ్లో జరిగిన సంఘటన గురించి సోషల్ మీడియాలో సమాచారం ఇచ్చారు. శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని హిందూ సమాజం ఉత్సాహంగా ఇక్కడ గుమిగూడటాన్ని తట్టుకోలేని ముష్కరులు ఆలయంపై దాడికి పాల్పడినట్లు ఆస్టిన్ తెలిపారు. జన్మాష్టమి సందర్భంగా ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో హిందువులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం, పోలీసుల నుంచి ఆమోదం తీసుకున్నట్లు తెలిసింది.
ఏడేండ్ల వయసు వరకు పిల్లలకు పరీక్షలు రద్దు
ఖలిస్తానీ దాడి : సీఎం బియాంత్ సింగ్ దారుణహత్య
ఇవి తినే 109 ఏండ్లు బతికా : జాన్ టిన్నిస్వుడ్
నాలుగు కాళ్ల తిమింగలం దొరికిందోచ్..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..