లండన్, మే 2: బ్రిటన్ పార్లమెంట్లోని ఎగువ సభ (హౌస్ ఆఫ్ లార్డ్స్)లో లైఫ్ పీర్గా నియమితులైన భారత సంతతికి చెందిన ఉదయ నాగరాజు మొదటిసారి సభ్యులనుద్దేశించి శనివారం ప్రసంగించారు. హరింత ఇంధనంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ..2030 నాటికి దేశంలో కాలుష్య రహిత విద్యుత్తు ఉత్పత్తిని సాధించాలన్న లక్ష్యాన్ని కొనియాడారు.
ఈ ప్రక్రియలో సాంకేతికత, సృజనాత్మకతకు కృత్రిమ మేధస్సు (ఏఐ)ని జోడిస్తే అద్భుతాలు సాధించగలమని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు విద్యాభ్యాసం బ్రిటన్లోనే సాగింది. బ్రిటన్ పౌరసత్వం పొందిన ఆయనను ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ సిఫారసు మేరకు రాజు కింగ్ చార్లెస్-3 గత డిసెంబర్లో లైఫ్ పీర్గా నియమించారు.