Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) భారత్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్లో న్యూ ఢిల్లీ (Delhi)లో జీ20 (G20 summit) దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాలుగు రోజుల పర్యటన నిమిత్తం బైడెన్ భారత్కు వస్తున్నారు. ఈ మేరకు అమెరికా వైట్హౌస్ (White House) జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ (Jake Sullivan) మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
20 దేశాల మధ్య జరిగే ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బైడెన్ సెప్టెంబర్ 7 నుంచి 10వ తేదీల్లో భారత్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన భారత్తో ద్వైపాక్షిక సమావేశాలను కూడా జరుపుతారని సల్లివన్ తెలిపారు. కాగా, అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ భారత్కి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.
US President Joe Biden will visit India from Sept 7-10 to attend a summit of the Group of 20 nations, White House national security adviser Jake Sullivan told a briefing on Tuesday, reports Reuters.
(file photo) pic.twitter.com/wT7hLbiGUc
— ANI (@ANI) August 22, 2023
ఇదిలా ఉండగా, జీ20 సమ్మిట్ నేపథ్యంలో సెప్టెంబర్ 8 నుంచి 10వ తేదీ వరకు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించే ప్రతిపాదనకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఆమోదం తెలిపారు. ఆ తేదీల్లో ఢిల్లీలోని అన్ని కార్యాలయాలు, విద్యా సంస్థలను మూసివేయనున్నారు.
CM Arvind Kejriwal approves the proposal to declare public holiday from 8th to 10th September in Delhi, in view of the G20 summit. All schools, govt offices including MCD offices will be closed on these dates https://t.co/105HOuR9mQ
— ANI (@ANI) August 22, 2023
Also Read..
CR Rao: ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త సీఆర్ రావు కన్నుమూత
Hyderabad | బేగంపేట రన్నింగ్ కారులో మంటలు.. తప్పిన ప్రమాదం