Rafah | దక్షిణ గాజా నగరమైన రఫా (Rafah)పై సైనిక దాడులను వెంటనే నిలిపివేయాలన్న అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) ఆదేశాలను ఇజ్రాయెల్ (Israel Army) బేఖాతరు చేసింది. రఫాపై దాడులను మరింత పెంచేసింది. నగరంలోని పలు లక్ష్యాలను బాంబులతో నాశనం చేయాలని ఇజ్రాయెల్ సైన్యం ప్రణాళికలు చేపట్టింది. ఇందులో భాగంగానే రఫాపై ఆదివారం విరుచుకుపడింది.
నివాసితులు ఉంటున్న గుడారాలపై వరుసగా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 35 మంది పాలస్తీనియన్లు (Palestinian) మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. డజన్ల కొద్దీ ప్రజలు గాయపడినట్లు తెలిపింది. మృతుల్లో చాలా మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలిపింది. మృతులు, గాయపడిన వారిని తీసుకెళ్లేందుకు రఫాలో సరిపడా సామర్థ్యం ఉన్న ఆసుపత్రులేవీ లేవని పేర్కొంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. కాగా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసిన ప్రాంతం వలసదారులతో కూడిన క్యాంప్ అని పాలస్తీనా రెడ్ క్రిసెంట్ సొసైటీ వెల్లడించింది. ఇక చాలా మంది పాలస్తీనియన్లు తలదాచుకుంటున్నట్లు తెలిపింది.
Also Read..
Kavya Maran | ఫైనల్లో హైదరాబాద్ ఓటమి.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న కావ్య మారన్
Arvind Kejriwal | మధ్యంతర బెయిల్ మరో 7 రోజులు పొడిగించండి.. సుప్రీంను ఆశ్రయించిన కేజ్రీవాల్
Tribute | భారత తొలి ప్రధాని నెహ్రూకు ఖర్గే, సోనియా నివాళులు.. Video