Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరోసారి సుప్రీంకోర్టును (Supreme Court ) ఆశ్రయించారు. లోక్సభ ఎన్నికల దృష్ట్యా లిక్కర్ స్కాం కేసులో తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను మరో 7 రోజులు పొడిగించాలని కోరుతూ (Extend Interim Bail) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు.
ఇక మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన తర్వాత తాను 7 కిలోల బరువు తగ్గినట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కీటోన్ స్థాయిలు పెరిగాయని.. అందుకే తాను పీఈటీ-సీటీ స్కాన్ సహా పలు పరీక్షలు చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలోనే వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా తన మధ్యంతర బెయిల్ గడువును మరో 7 రోజులు పొడిగించాలని సుప్రీం ధర్మాసనాన్ని తన పిటిషన్లో కోరారు.
కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ అరెస్టైన విషయం తెలిసిందే. మార్చి 21న ఈడీ(ED) అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్నారు. దాదాపు 50 రోజులపాటు జైల్లో ఉన్న ఆయనకు లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జూ 1 వరకూ బెయిల్ మంజూరు చేసింది. ఇక జూన్ 2న ఆయన లొంగిపోవాల్సి ఉంది.
Also Read..
Flights delay | కోల్కతాలో భారీ వర్షం.. ఆలస్యంగా నడుస్తున్న విమానాలు.. Video
Road accident | కృష్ణా జిల్లాలో లారీని ఢీకొట్టిన కారు.. కారులోని నలుగురు అక్కడికక్కడే మృతి
MLC Bye Election | ప్రశాంతంగా కొనసాగుతున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్