Israel-Hamas War | యుద్ధంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇజ్రాయెల్ (Israel) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) పాలనలో ఉన్న గాజా (Gaza)ను పూర్తిగా దిగ్బంధించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే గాజాకు వెళ్లే కీలక సరఫరాను నిలిపివేసింది.
ఈ మేరకు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి (Israeli Defense Minister) యోవ్ గాలంట్ (Yoav Gallant) సోమవారం ప్రకటించారు. ‘గాజా స్ట్రిప్ని పూర్తిగా దిగ్బంధించమని నేను ఆదేశాలు జారీ చేశాను. ఇక అక్కడ కరెంటు, ఆహారం, ఇంధనం ఏవీ ఉండవు. అన్నీ మూసేశారు. మేము ఇప్పుడు మానవ జంతువులతో పోరాడుతున్నాము. అందుకు తగ్గట్టే వ్యవహరిస్తాము’ అని ఆయన వెల్లడించారు.
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) దాడులతో ఇజ్రాయెల్ (Israel) ఉక్కిరిబిక్కిరవుతోంది. రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధం (Israel-Hamas War ) తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటికే ఇరు దేశాలకు చెందిన సుమారు 1,100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒక్క ఇజ్రాయెల్ (Israel)లోనే 44 మంది సైనికులు సహా 700 మందికిపైగా ప్రజలు చనిపోయారు. వేల సంఖ్యలో గాయపడ్డారు.
గాజా.. అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతం. 362 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోనే సుమారుగా 20 లక్షల మంది నివసిస్తున్నారు. ప్రస్తుత యుద్ధంతో వారంతా బిక్కుబిక్కుంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. గాజాకు తూర్పు, ఉత్తర భాగాల్లో ఇజ్రాయెల్, దక్షిణాన ఈజిప్టు, పశ్చిమ భాగంలో మధ్యదరా సము ద్రం సరిహద్దులుగా ఉన్నాయి. యుద్ధం కారణంగా ఇరుదేశాలు జల, వాయు, భూ దిగ్బంధాన్ని విధించాయి. దీంతో గాజా వాసులు ఎటువెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఎటునుంచి మృత్యువు వస్తుందో తెలియక చావు భయంతో నరకయాతన అనుభవిస్తున్నారు. గతంలో 2005-06లో తాత్కాలికంగా, 2007లో శాశ్వతంగా ఇలా గాజా దిగ్బంధంలో చిక్కుకుంది. ఇక, 2007లో గాజాను హస్తగతం చేసుకున్న నాటి నుంచి ఈ 15 ఏండ్లలో ఇజ్రాయెల్పై హమాస్ ఐదుసార్లు దాడులకు దిగింది.
Also Read..
Israel-Hamas War | మ్యూజిక్ ఫెస్టివల్పై హమాస్ మిలిటెంట్ల దాడి.. 260 మంది మృతి
Israel-Hamas War | ఇజ్రాయెల్కు మద్దతుగా రంగంలోకి అమెరికా యుద్ధ నౌకలు
Afghanistan Earthquake | అఫ్గాన్లో 2400 దాటిన భూకంప మృతుల సంఖ్య