బాగ్దాద్: ఇరాక్లోని ఓ కరోనా ఆస్పత్రిలో శనివారం రాత్రి జరిగిన అగ్నిమాదంలో మృతుల సంఖ్య 82కు చేరింది. మరో 110 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలోనూ పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఇరాక్ రాజధాని బాగ్దాద్ శివార్లలోని అల్ ఖతిబ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ఈ ప్రమదంలో 22 మంది అక్కడికక్కడే మృతిచెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తుండగా వారిలో తీవ్రంగా గాయపడ్డ పలువురు వరుసగా ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఆదివారం సాయంత్రానికి మొత్తం మృతుల సంఖ్య 82కు చేరింది. ఇరాక్ విదేశాంగ శాఖ ఈ వివరాలను మీడియాకు వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ఒంట్లో వేడిని తగ్గించే ఈ చిట్కాలు మీకు తెలుసా..?
మమతాజీ.. బెంగాలీలు ఎవరికీ భయపడరు: జేపీ నడ్డా
దేశాన్ని మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేసింది: ప్రధాని మోదీ
రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు : ఐఎండీ
కొవిడ్ హాస్పిటల్లో మంటలు.. 23 మంది రోగుల మృతి
సుప్రీం కోర్టు జడ్జి మోహన్ ఎం శాంతనగౌడర్ కన్నుమూత
రాష్ట్రంలో కొత్తగా 8 వేల కరోనా కేసులు