టెహ్రాన్: ఇరాన్(Iran) కౌంటర్ వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ తమ విద్యుత్తు ప్లాంట్లను టార్గెట్ చేస్తే తాము కూడా ప్రతిదాడి చేస్తామని ఇరాన్ పేర్కొన్నది. ఇజ్రాయెల్ పవర్ ప్లాంట్లను, అమెరికా స్థావరాలకు విద్యుత్తు సరఫరా చేస్తున్న దేశాల పవర్ ప్లాంట్లపై దాడి చేయనున్నట్లు ఇరాన్ రెవల్యూషరీ గార్డ్స్ పేర్కొన్నారు. ఒకవేళ పవర్ ప్లాంట్లపై దాడి చేస్తే .. డీశాలినేషన్ల ప్లాంట్లను పేల్చుతామని తొలుత ఇరాన్ పేర్కొన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు మాట మార్చి పవర్ ప్లాంట్లను పేల్చనున్నట్లు ఇరాన్ గార్డ్స్ వెల్లడించారు
హోర్ముజ్ జలసంధిని 48 గంటల్లో తెరవకుంటే, ఇరాన్ పవర్ ప్లాంట్లను పేల్చివేస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ వార్నింగ్కు కౌంటర్గా ఇరాన్ కూడా తాజా వార్నింగ్ జారీ చేసింది. బెదిరింపులు ఏ స్థాయిలో ఉన్నా.. ఆ స్థాయికి తగినట్లు ధీటుగా బదులిస్తామని, వెనుకడుగు వేయబోమని, ఒకవేళ మీరు విద్యుత్తును టార్గెట్ చేస్తే, మేం కూడా విద్యుత్త ప్లాంట్లను టార్గెట్ చేస్తామని రెవల్యూషనరీ గార్డ్స్ తెలిపారు.