టెహ్రాన్: ఆఫ్ఘనిస్థాన్లో ఎన్నికలు జరపాలని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించడానికి త్వరగా ఎన్నికలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. దేశంలో తిరిగి శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు తాము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేయాలన్నారు. తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ను ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తమ ఆధీనంలోని పంజ్షేర్ను ఆక్రమించుకోవడానికి తాలిబన్ సేనలు పోరాడుతున్నాయి.
‘ఇరాన్ ఎప్పుడూ ఆఫ్ఘనిస్తాన్లో శాంతి, ప్రశాంతతను కోరుకుంటుంది. రక్తపాతం, హత్యలు ప్రజల సార్వభౌమత్వాన్ని అంతం చేస్తున్నాయి. ఆఫ్ఘన్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి మద్దతిస్తాం’ అని ఇబ్రహీం రైసీ అన్నారు.