కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల అనంతర హింసాకాండ నేపథ్యంలో శాంతి భద్రతల పరిస్థితిని తనకు సమగ్రంగా నివేదించాలని కోరుతూ గవర్నర్ జగ్దీప్ దంకర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శనివారం సమన్లు జారీ చేశారు. అల్లర్లకు సంబంధించి తనకు అదనపు ముఖ్య కార్యదర్శి హెచ్ ఎస్ ద్వివేది తనకు ఎలాంటి సమాచారం అందించలేదని డీజీపీ, కోల్ కతా పోలీస్ కమిషనర్ లు మే 3న తనకు పంపిన నివేదికలను తొక్కిపెట్టారని ఆయన మండిపడ్డారు.
ఎన్నికల అనంతర హింసపై తనకు సమగ్రంగా వివరించేందుకు శనివారం సాయంత్రం ఏడు గంటలలోగా తనను కలిసి నివేదించాలని గవర్నర్ జగ్దీప్ దంకర్ ట్వీట్ చేశారు. అదనపు ముఖ్యకార్యదర్శి ద్వివేది విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం కనబరిచారని, డీజీపీ, పోలీస్ కమిషనర్ల నివేదికలను తనకు సమర్పించకపోవడం పట్ల ఆయన తీరును గవర్నర్ తప్పుపట్టారు. ఎన్నికల అనంతర హింసపై రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.