Shubhanshu Shukla | పలుమార్లు వాయిదా తర్వాత భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) రోదసి యాత్రకు రంగం సిద్ధమైంది. యాక్సియం-4’ మిషన్లో భాగంగా శుభాన్షుతో పాటూ మరో ముగ్గురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (International Space Station) వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించి స్పేస్ ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ను ఫ్లోరిడాలోని నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించబోతున్నారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:01 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది.
గురువారం ఉదయం 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం ) డాకింగ్ ప్రక్రియ ఉంటుంది. ఈ మిషన్కు పెగ్గీ విట్సన్ కమాండర్గా, శుక్లా మిషన్ పైలట్గా వ్యవహరిస్తున్నారు. హంగేరీకి చెందిన టిబోర్ కపు, పోలండ్కు చెందిన స్లావోజ్ ఉనాన్సిక్-విన్సివిస్క్లు మిషన్ స్పెషలిస్టులుగా ఉన్నారు. మే 29న చేపట్టాల్సిన ఈ మిషన్ ఆరుసార్లు వాయిదా పడింది.
అమెరికా ప్రైవేట్ స్పేస్ సంస్థ యాక్సియం (Axiom Space) చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ‘ఏఎక్స్-4’ మిషన్ (Ax 4 mission)లో భాగంగా స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ (SpaceX Falcon 9 rocket) ద్వారా వీరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. దీంతో ప్రైవేట్ రోదసి యాత్ర ద్వారా ఐఎస్ఎస్కు వెళ్లిన తొలి భారత వ్యోమగామిగా శుభాన్షు చరిత్రకెక్కనున్నారు. ఇప్పటికే భారత్కు చెందిన ప్రముఖ వ్యోమగామి రాకేశ్ శర్మ రోదసి యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. రష్యా సహకారంతో అంతరిక్షయానం చేశారు. రాకేశ్ శర్మ రోదసి యాత్ర చేసిన నాలుగు దశాబ్దాల (1984) తర్వాత శుభాన్షు ఈ గౌరవాన్ని దక్కించుకోనున్నారు. నాసా సహకారంతో శుక్లా ఐఎస్ఎస్లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు. పైలట్గా ఈ యాత్రలో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నానని శుక్లా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read..
Fire Accident: పాలిథీన్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి, ముగ్గురికి గాయాలు
Emergency 1975 | ఎమర్జెన్సీకి 50 ఏండ్లు.. భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయం
Odisha | ఒడిశాలో దళితులపై అమానుషం.. గుండు కొట్టించి.. గడ్డి తినిపించి!