హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ వరింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర నాయకులు.. పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలను కలిసి విజ్ఞప్తిచేశారు. జర్నలిస్టుల సమస్యలపై సోమవారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నా నిర్వహించిన ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, నేతలు తన్నీరు శ్రీనివాస్, బండి విజయ్కుమార్ తదితరులు మంగళవారం కేంద్ర మంత్రులు జీ కిషన్రెడ్డి, బండి సంజయ్, కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులకు వినతిపత్రాలు అందజేశారు.
‘కొవిడ్ సందర్భంగా రద్దు చేసిన జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్లను తిరిగి పునరుద్ధరించాలి. దేశవ్యాప్తంగా రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలి. జర్నలిస్టులు, సొసైటీలకు ఇండ్ల స్థలాలు కేటాయించే విషయమై సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించి ఇండ్ల స్థలాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నేషనల్ కౌన్సిల్ సభ్యులు కుంచం శ్రీనివాస్, పరాల సమ్మయ్యగౌడ్, కే రమాదేవి, పద్మనాభరావు, నాయకులు గోపాల్, మోయిజ్ తదితరులు పాల్గొన్నారు.