Internet shutdown| న్యూఢిల్లీ: భారత్లో తరచూ ఇంటర్నెట్పై నిషేధం విధించడంపై జీ20 సమావేశంలో చర్చ జరిగింది. ప్యానల్లో మెంబర్ అయిన ‘ఇంటర్నేషనల్ డిజిటల్ హెల్త్ అండ్ ఏఐ రిసెర్చ్ కొలాబరేటివ్’కు చెందిన నీనా న్వకన్మ మాట్లాడుతూ.. ఇంటర్నెట్పై భారత్ తరచూ నిషేధం విధించడాన్నినిలిపివేయాలని కోరారు. ఇంటర్నెట్పై నిషేధం విధించాల్సి వస్తే, చట్టపరమైన అన్ని నిబంధనలు పాటించాలని సూచించారు. నిషేధం విధించడానికి గల కారణాలను ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు.
ఇంటర్నెట్ షట్డౌన్ క్యాపిటల్గా భారత్ మారుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ నిషేధం విషయంలో వరుసగా ఐదోసారి కూడా భారత్ మొదటిస్థానంలో నిలిచింది. యాక్సెస్ నౌ రిసెర్చ్ ప్రకారం.. ఇంటర్నెట్ షట్డౌన్లలో 58 శాతం వాటా భారత్దే. ఇటీవల మణిపూర్ ఘర్షణల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో నిరవధికంగా ఇంటర్నెట్పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నది.