కరాచీ, సెప్టెంబర్ 11: పాకిస్థాన్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారు. అక్కడి లక్షలాది మంది నిలువనీడ లేకుండా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే కచ్చి జిల్లాలోని జలాల్ ఖాన్ గ్రామ ప్రజలు మాత్రం సురక్షితంగా ఉన్నారు.
ఎందుకంటే అక్కడ ఉన్న బాబా మధోదాస్ హిందూ దేవాలయం వారికి ఆశ్రయం కల్పించింది. గుడి నిర్వాహకులు దాదాపు 200 నుంచి 300 మంది (చాలా మంది ముస్లింలు)కి ఆశ్రయంతో పాటు ఆహారం కూడా అందిస్తున్నారు.