న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో తల్లడిల్లిన దేశ రాజధాని క్రమంగా తేరుకుంటోంది. కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో పాటు పాజిటివిటీ రేటు రెండు నెలల కనిష్ట స్థాయిలో 2 శాతం దిగువకు పడిపోవడం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 1491 తాజా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి ఒక్కరోజులో 130 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఢిల్లీలో బుధవారం వరుసగా నాలుగో రోజు కూడా కరోనా కేసులు 2000 లోపు నమోదయ్యాయి. నగరంలో కరోనా పాజిటివిటీ రేటు 1.93 శాతానికి పడిపోయిందని ఢిల్లీ ప్రభుత్వం హెల్త్ బులెటిన్ లో పేర్కొంది. కరోనా మహమ్మారి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకూ అన్ని జాగ్రత్తలు పాటించాలని, కొవిడ్-19 నియంత్రణలను ప్రజలు విధిగా పాటించాలని ప్రభుత్వం కోరింది.