కరోనా అధ్యాయం ముగింపునకు వచ్చిందని ప్రపంచం అనుకుంటున్న సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) మరోమారు హెచ్చరికలు జారీ చేసింది. యూరప్లో మరో కరోనా వేవ్ వచ్చే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ఏడాది క్రితం ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేనప్పటికీ, కరోనా ప్యాండెమిక్ ఇంకా సమసిపోలేదని డబ్ల్యూహెచ్వో యూరప్ డైరెక్టర్ హాన్స్ క్లూగ్ అన్నారు.
ఈసీడీసీ డైరెక్టర్ ఆండ్రియా అమ్మాన్తో కలిసి ఆయన ఒక స్టేట్మెంట్ విడుల చేశారు. ప్రాంతాలవారీగా డబ్ల్యూహెచ్వో చేసిన సర్వేలో అక్టోబర్ 2తో ముగిసిన వారంలో కేవలం యూరప్లోనే 8శాతం కరోనా కేసులు పెరిగినట్లు ఆయన చెప్పారు. వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయా? లేవా? అనే సందిగ్ధత, వ్యాక్సిన్ ఫాటిగ్ (అలసట) తదితర కారణాల వల్ల ప్రజలు బూస్టర్ డోస్ తీసుకోవడం లేదని క్లూగ్ తెలిపారు.
ఇప్పటికీ యూరప్లో లక్షలాది మంది ప్రజలు వ్యాక్సిన్ తీసుకోలేదని డబ్ల్యూహెచ్వో, ఈసీడీసీ సంస్థలు తెలిపాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మరో కొత్త కరోనా వేవ్ మొదలైందనే సంకేతాలు ఇస్తున్నాయని, ఇది జరగడానికి మరెంతో సమయం లేదని హెచ్చరించాయీ సంస్థలు.