కాబూల్: అఫ్ఘానిస్థాన్లో ఇవాళ మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 6.2 గా నమోదైంది. శనివారం మధ్యాహ్నం 12:42 గంటలకు తుర్క్మెనిస్థాన్లోని అస్గాబట్ నగరానికి ఆగ్నేయంగా 428 కిలో మీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 34 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
అయితే, ఈ భూకంపానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ భూకంపంవల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం లేదని వారు పేర్కొన్నారు.
An earthquake with a magnitude of 6.2 on the Richter Scale hit Afghanistan at 12:42 pm today: National Centre for Seismology https://t.co/yLpG6uOver pic.twitter.com/TDbxzxGjOQ
— ANI (@ANI) October 7, 2023