హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా టీ హబ్..మే 1న(బుధవారం) సమ్మిట్ను నిర్వహిస్తున్నది.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేశ్ రంజన్ హాజరుకానున్న ఈ సమావేశాలకు కార్పొరేట్ కంపెనీలతోపాటు స్టార్టప్ల వ్యవస్థాపకులు పాల్గొంటున్నారు.