హైదరాబాద్, ఏప్రిల్ 30: అభిబస్..వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లలో మే 13న ఓటు వినియోగించుకునే వారికోసం ఈ రాయితీని తెరపైకి తీసుకొచ్చింది.
మే 11 నుంచి 15 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ కింద రూ.250 వరకు రాయితీ పొందవచ్చును. దీంతోపాటు రూ.100 క్యాష్బ్యాక్ కూడా పొందవచ్చునని తెలిపింది. ఈ ఆఫర్ పొందాలంటే ‘ABHIVOTE’ కోడ్ను వినియోగించాల్సి ఉంటుందని పేర్కొంది.