కఠ్మండూ: నేపాల్ రాజధాని కఠ్మండూలో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 7.58 గంటల సమయంలో కఠ్మండూలో భూమి కంపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ సీస్మోలజీ తెలిపింది. కఠ్మండూకు 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధిటుంగ్ వద్ద భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.
కాగా, నేపాల్ సరిహద్దుల్లోని బీహార్కు చెందిన సీతామర్హి, ముజఫర్పూర్, భాగల్పూర్, అరారియా, సమస్తిపూర్లో కూడా భూమి కంపించిందని అధికారులు వెల్లడించారు. ఉదయం 8 గంటల సమయంలో స్వల్పంగా భూ ప్రకంపణలు వచ్చాయని తెలిపారు.