కఠ్మండూ: హిమాలయ దేశం నేపాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున 4.37 గంటల సమయంలో రాజధాని కఠ్మండూలో (Kathmandu) భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 4.3గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది. కఠ్మండూకు 166 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. దీనివల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా అందలేదని అధికారులు తెలిపింది. అయితే ఉదయాన్నే భూమికంపించడంతో నిద్రలో ఉన్న ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.