Earthquake | పొరుగుదేశం పాకిస్థాన్ (Pakistan)లో మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. బుధవారం తెల్లవారుజామున పాక్ – ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుకు (Pakistan-Afghanistan border) సమీపంలో భూమికి 105 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Centre for Seismology) వెల్లడించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 5.5గా నమోదైనట్లు వెల్లడించింది.
తెల్లవారుజామున 2:57 గంటల ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లు పేర్కొంది. కాగా ఈ భూకంపం ధాటికి ఇస్లామాబాద్, లాహోర్, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు.
కాగా, పాకిస్థాన్లో ఇటీవలే వరుస భూకంపాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. గత నెల 17న ఇస్లామాబాద్ సమీపంలో 4.7 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయి. అలాగే ఈ ఏడాది జనవరిలో 4.3తీవ్రతతో ఒకసారి, 6.0 తీవ్రతతో మరోసారి భూకంపం సంభవించింది.
Also Read..
యునిలీవర్లో 7,500 ఉద్యోగాల కోత
Zomato: గ్రీన్ రైడర్స్పై క్లారిటీ ఇచ్చిన జొమాటో సీఈవో
Dolma aunty | డోల్మా ఆంటీ మోమో.. ఢిల్లీలోని లజ్పత్నగర్లో ప్రసిద్ధి