కేసీఆర్ నాయకత్వంలో ఆయన ఆశయాలను నేరవేరుస్తాం..
సేవలకు గుర్తుగానే యేడాదిగా శతజయంత్యుత్సవాలు.. n మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
నిర్మల్ టౌన్, జూన్ 28: మాజీ ప్రధాని పాములపర్తి వేంకట నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలతోనే దేశం అభివృద్ధిబాటలో పయనించిందని, క్లిష్ట సమయంలో దేశానికి విశేష సేవలు అందించారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పీవీ శత జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు.
మాజీ ప్రధాని పీవీ నర సింహారావు దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో అభివృద్ధి బాటలో నిలిపిన మహనీయుడని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో పీవీ నరసింహారావు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతో కలిసి పీవీ చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడారు. క్లిష్ట సమయంలో పీవీ దేశానికి సేవలందించారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పీవీ ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. పీవీ సేవలను గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం ఏడాది కాలంగా శతజయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నదని పేర్కొ న్నారు. పీవీ కుటుంబానికి చెందిన వాణిదేవికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చి గెలిపించుకొని గౌరవం ఇచ్చిందన్నారు. 1991లో తాను టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో మైనార్టీ సర్కారును గట్టెక్కించేందుకు పీవీకి మద్దతిచ్చినట్లు చెప్పారు. జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, డీఆర్వో రమేశ్ రాథోడ్, ఎఫ్ఏసీఎస్ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీగారి రా జేందర్, ముత్యంరెడ్డి, మారుగొండ రాము, ఉన్నారు.
పేదలకు వరం సీఎంఆర్ఎఫ్
సోన్, జూన్ 28: ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ని ర్మల్ పట్టణంలోని మంత్రి నివాస భవనంలో సోన్, సాకెర, మాదాపూర్, వెల్మల్, పాక్పట్ల, కూచన్పెల్లి గ్రామాల్లోని పలువురు బాధితులకు సీఎంఆర్ఎఫ్ చె క్కులు అందజేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వీ స త్యనారాయణ గౌడ్, సోన్ మండల కన్వీనర్ మోహినొద్దీన్, నిర్మల్ మండల మాజీ కన్వీనర్ ముత్యంరెడ్డి, ఎఫ్ఏసీఎస్ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, గ్రామ సర్పంచ్లు సుంచు సుప్రజ శ్రీనివాస్, తదితరులున్నారు.