WHO on Covid Deaths | కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా మృతుల అధికారిక గణాంకాలు తప్పని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తెలిపింది. 2021 చివరికల్లా 14.9 మిలియన్ల మంది కొవిడ్-19 బారీన పడి ఉంటారని అంచనా వేస్తున్నట్లు గురువారం వెల్లడించింది. 2020 జనవరి నుంచి 2021 డిసెంబర్ మధ్య 5.4 మిలియన్ల మంది మాత్రమే మరణించారని డబ్ల్యూహెచ్వోకు నివేదికలు వచ్చాయి.
భారీ ఇన్ఫెక్షన్ వేవ్ల మధ్య హెల్త్కేర్, ఇతర వసులు అంందుబాటులోకి రాక, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని తెలిపింది. కరోనాకు ముందుకు కూడా ప్రతి పది మరణాల్లో ఆరు మృతులు రిజిస్టర్ కాలేదని డబ్ల్యూహెచ్వో గుర్తు చేసింది. పలు దేశాలు పూర్తిస్థాయిలో కరోనా మృతుల వివరాలు నివేదించలేదని పేర్కొంది. కరోనా వేళ లాక్డౌన్ల వల్ల ట్రాపిక్ యాక్సిడెంట్లు తగ్గాయి.
భారత్లో కరోనా మృతుల్లో దాదాపు సగం మరణాలు రిపోర్ట్ చేయలేదని డబ్ల్యూహెచ్వో వివరించింది. గతేడాది మే-జూన్ మధ్య కరోనా సెకండ్ వేవ్లో 4.7 మిలియన్ల మంది మృతి చెంది ఉంటారని అంచనా వేసింది. కానీ 2020, 2021ల్లో భారత్లో 4.80 లక్షల్లోపే కరోనా మృతులు సంభవించాయని కేంద్రం రిపోర్ట్ చేసింది. 1918 స్పానిష్ ఫ్లూ వల్ల సుమారు 50 మిలియన్ల మంది, 1980వ దశాబ్ది ప్రారంభం నుంచి హెచ్ఐవీ వల్ల 36 మిలియన్ల మంది మరణించారు.