లండన్: బ్రిటన్ మంత్రివర్గంలో కరోనా కలకలం రేగింది. ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్కు శనివారం కరోనా నిర్ధారణ అయింది. శుక్రవారం ఆయనను కలిసిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆర్థిక మంత్రి రిషి సునక్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. జావిద్ ఇప్పటికే వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నా కరోనా బారిన పడటం గమనార్హం.