Corona Deaths | ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతటి విలయాన్ని సృష్టించిందో తెలిసిందే. స్విట్జర్లాండ్ దేశంలో కూడా ఈ మహమ్మారి తీవ్రమైన ప్రభావం చూపింది. ఇక్కడ ఇప్పటి వరకూ 10 లక్షలపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే 11వేల మందికిపైగా పేషెంట్లు ఈ వైరస్కు బలయ్యారు.
ఈ నేపథ్యంలో ఆ దేశ పార్లమెంటు ఎదురుగా 11 వేలపైగా క్యాండిల్స్ వెలిగించి, కరోనా మృతులకు నివాళులర్పించారు. ఇలా క్యాండిల్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు మాట్లాడుతూ.. ‘ఈ చర్య కరోనా మృతులకు నివాళితోపాటు వైరస్ వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి చేసే వినతి కూడా’ అని తెలిపారు.
కాగా, ఇటీవల స్విట్జర్లాండ్లో మరోసారి కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ భయాలు కూడా ఉండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.